తెలంగాణ

telangana

ETV Bharat / bharat

15 ఏళ్ల తర్వాత భారత్​కు చిక్కిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్​స్టర్

Gangster Suresh Pujari: మోస్ట్​వాంటెడ్​ గ్యాంగ్​స్టర్​ సురేశ్​ పూజారిని మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్​ నుంచి భారత్​కు తీసుకొచ్చారు అధికారులు. ఆ తర్వాత మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక బృందం తమ కస్టడీలోకి తీసుకుని ముంబయికి తరలించింది. మహారాష్ట్ర, కర్ణాటకలో నమోదైన పలు దోపిడీ కేసుల్లో 15 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు సురేశ్​ పూజారి.

By

Published : Dec 15, 2021, 4:03 PM IST

Underworld don Suresh Pujari
భారత్​కు గ్యాంగ్​స్టర్​​ సురేశ్​ పూజారి​

Gangster Suresh Pujari: మహారాష్ట్ర, కర్ణాటకలో పలు దోపిడీ కేసుల్లో మోస్ట్​ వాంటెడ్​, 15 ఏళ్లుగా పరారీలో ఉన్న గ్యాంగ్​స్టర్​ సురేశ్​ పూజారిని భారత్​కు రప్పించారు అధికారులు. ఫిలిప్పీన్స్​ నుంచి మంగళవారం రాత్రి భారత్​కు తీసుకొచ్చినట్లు సీనియర్​ పోలీస్​ అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్​) పూజారిని దిల్లీలో బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఠాణె నగరంలో నమోదైన పలు కేసుల్లో విచారణ నిమిత్తం.. ముంబయికి తరలించినట్లు వెల్లడించారు.

మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్​ నుంచి దిల్లీకి తీసుకొచ్చిన తర్వాత మొదటగా.. ఇంటెలిజెన్స్​ బ్యూరో(ఐబీ), సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటికే.. దిల్లీ చేరుకున్న డీసీపీ రాజ్​కుమార్​ శిందే నేతృత్వంలోని ఏటీఎస్​ బృందం.. పూజారిని కస్టడీలోకి తీసుకుని బుధవారం ఉదయం వాయుమార్గంలో ముంబయికి తీసుకొచ్చింది.

పూజారిని ముంబయికి తీసుకొచ్చిన తర్వాత.. కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరినట్లు చెప్పారు. ఏటీఎస్​ కస్టడీ పూర్తయ్యాక.. రాష్ట్ర రాజధానిలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా.. ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు అధికారులు.

పలు కేసుల్లో మోస్ట్​వాంటెడ్​..

ముంబయి, ఠాణె, కల్యాన్​, ఉల్హాస్​నగర్​, దోంబివలిలో నమోదైన పలు దోపిడీ కేసుల్లో పూజారి మోస్ట్​వాంటెడ్​. ఈ క్రమంలో 2017, 2018 రెడ్​ కార్నర్​ నోటీసులు ఇచ్చారు ముంబయి, ఠాణె పోలీసులు. మహారాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు.. ఠాణెలో పూజారిపై నమోదైన కేసులన్నింటినీ రాష్ట్ర ఏటీఎస్​కు బదిలీ చేశారు. ఆయా కేసుల్లో ఇకపై ఏటీఎస్​ దర్యాప్తు కొనసాగిస్తుందని పోలీస్​ అధికారి తెలిపారు.

15 ఏళ్లుగా పరారీలో ఉన్న పూజారిని గత అక్టోబర్​లో ఫిలిప్పీన్స్​లో పట్టుకున్నారు. ఒక్క ఠాణెలోనే అతనిపై 23 దోపిడీ కేసులు నమోదయ్యాయి. గ్యాంగ్​స్టర్​ రవి పూజారికి అత్యంత దగ్గరి బంధువు. 2007లో అతని నుంచి వేరుపడి.. గ్యాంగ్​ను ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడ్డాడు. అండర్​వరల్డ్​ డాన్​ చోటా రాజన్​తోనూ పని చేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు.

ఇదీ చూడండి:

ఫిలిప్పీన్స్​లో గ్యాంగ్​స్టర్​ సురేశ్​ పుజారి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details