తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2022, 9:02 AM IST

ETV Bharat / bharat

మైనర్​పై టీచర్​ అత్యాచారం.. సోదరిని పెళ్లి చేసుకున్నాడని స్నేహితుడి హత్య​

Gang rape: రాజస్థాన్​లో రెండు దారుణ ఘటనలు వెలుగు చూశాయి. ఇంటర్​ విద్యార్థినిని అపహరించి ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడో ఉపాధ్యాయుడు. ఈ సంఘటన జోధ్​పుర్​ జిల్లాలో జరిగింది. మరోవైపు.. చెల్లెలిని ప్రేమించి ఇంట్లో నుంచి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో స్నేహితుడినే హతమార్చాడో యువకుడు. ఈ సంఘటన చురు జిల్లాలో వెలుగుచూసింది.

Gang rape
మైనర్​పై టీచర్​ అత్యాచారం

Gang rape: 11వ తరగతి విద్యార్థినిని అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె చదువుతోన్న పాఠశాలలోని ఓ టీచర్. ఆపై మరో ఇద్దరికి అప్పగించాడు. ఆ తర్వాత బాలికను టాయిలెట్​లో బంధించాడు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్​లోని జోధ్​పుర్​ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది..

ఈనెల 6న మధ్యాహ్నం విద్యార్థిని పొరిగింటి వారి తోటకు పనికి వెళ్లింది. కానీ, సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామస్థులతో కలిసి చుట్టు పక్కల వెతికారు. శుక్రవారం ఉదయం టీచర్​ ఇంటిలోంచి బాలిక అరుపులు విన్న ఓ వ్యక్తి.. బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. వెంటనే కొందరు గ్రామస్థులతో కలిసి అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. ఉపాధ్యాయుడి ఇంట్లోని ముత్రశాలలో బంధించి ఉన్న బాలికను కాపాడారు.

ఆ తర్వాత.. తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది బాధితురాలు. గురువారం మధ్యాహ్నం ఒకడు తనను వాహనంలో ఎత్తుకొచ్చాడని తెలిపింది. టీచర్​ ఇంటికి తీసుకొచ్చి ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారని చెప్పింది.

జోధ్​పుర్​కు సమీపంలోని ఒసైన్​ ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు.. మూడేళ్లుగా విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్నాడని, విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా మరో ఇద్దరికి అప్పగించాడని మతోరా పోలీసులు తెలిపారు. 'బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు.. ఉపాధ్యాయుడు సహా మరో ఇద్దరిపై అపహరణ, అత్యాచారం కేసులు నమోదు చేశాం. టీచర్​ని అరెస్ట్​ చేశాం. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టాం. 'అని తెలిపారు.

చెల్లిని పెళ్లి చేసుకున్నాడని స్నేహితుడి హత్య

Honour killing: రాజస్థాన్​లోని చురు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తన సోదరిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో దారుణంగా హత్య చేశాడో యువకుడు. మనీశ్​(27) మృతదేహాన్ని రాజ్​గఢ్​ ప్రాంతంలోని పొలాల్లో ఆదివారం ఉదయం గుర్తించారు పోలీసులు. శనివారం రాత్రి తన స్నేహితుడు వికాశ్​ను కలిసేందుకు వెళ్లినట్లు చెప్పారు.

జ్యుడీషియల్​ కస్టడీలో భాగంగా హరియాణా జైల్​లో ఉన్న సందర్భంగా మనీశ్​, వికాస్​ స్నేహితులుగా మారారు. ఓ అత్యాచారం కేసులో మనీశ్​ నిందితుడు కాగా.. పెట్రోల్​ పంపులో చోరీ కేసులో వికాస్​ కస్టడీలో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత మనీశ్​కు బెయిల్​ ఇప్పించాడు వికాశ్​. ఆ తర్వాత తరుచుగా వికాశ్​ ఇంటికి మనీశ్​ వెళ్లేవాడు. ఈ క్రమంలోనే వికాశ్​ సోదరి పూజతో మనీశ్​కు పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. 10 నెలల క్రితం ఇరువురు పారిపోయి వివాహం చేసుకున్నారు. దిల్లీలో ఓ సరకు రవాణా షాపులో పనిలో చేరాడు మనీశ్​.. ఇటీవల చురుకు వచ్చాడు. శనివారం సాయంత్రం వికాశ్​ను కలిసేందుకు వెళ్లి తిరిగి రాలేదు. తెల్లవారి పొలాల్లో మృతదేహాన్ని గుర్తించామని, నిందితుడు వికాశ్​ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:

మత్తు మాయలో యువత- మాఫియా గుప్పిట్లోకి రాష్ట్రాలు!

ABOUT THE AUTHOR

...view details