తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2022, 12:30 PM IST

ETV Bharat / bharat

భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం.. యువతిని కిడ్నాప్ చేసి 5 రోజులు గ్యాంగ్​రేప్​

భర్త కళ్లదుటే ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఆపై చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది. మరో ఘటనలో ఓ యువతిపై 5 రోజులు అత్యాచారం చేశారు ఇద్దరు కామాంధులు.

Miscreants gang raped wife infront of husband
Miscreants gang raped wife infront of husband

ఇంట్లోకి చొరబడి ఓ మహిళపై అత్యాచారం చేశారు దుండగులు. ఆపై ఎవరికైనా చెబితో చంపేస్తామని బెదిరించారు. రెండు రోజుల అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రాజస్థాన్​లోని సీరోహీ జిల్లాలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం..రోహిడా పోలీస్​ స్టేషన్​ పరిధిలో బాధిత మహిళ నివాసం ఉంటోంది. దొంగతనం కోసం ఆమె ఇంట్లోకి బుధవారం నలుగురు నిందితులు చొరబడ్డారు. అనంతరం వెండి ఆభరణాలు, రూ.1400 నగదును దొంగతనం చేశారు. బాధితురాలి భర్తను బంధించి.. అతడి కళ్ల ముందే భార్యను అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు దుడంగులు. భయంతో రెండు రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాలేదు బాధితురాలు. రెండ్రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

పొగాకు తీసిన ప్రాణం..
పొగాకు కోసం డబ్బులివ్వలేదని ఓ వ్యక్తిని చంపేశారు ఇద్దరు దుండగులు. చనిపోయిన వ్యక్తిని మక్తా అలియాస్​ సుభాస్ శక్యాగా గుర్తించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో జరిగింది.
ఇదీ జరిగింది.. సుభాస్​ శక్యా అనే యువకుడు పొగాకు కొనడానికి ఓ దుకాణానికి వెళ్లాడు. అనంతరం డబ్బులు ఇవ్వకుండా పారిపోయే ప్రయత్నం చేశాడు. శక్యాను వెంబడించిన షాపు ఓనర్ కరణ్ యాదవ్​, అతడి కుమారుడు సచిన్ యాదవ్.. శక్యాను పట్టుకున్నారు. ఆగ్రహించిన కరణ్​ యాదవ్​.. పిడిగుద్దులతో అతడిపై దాడి చేశాడు. దీంతో శక్యా అక్కడిక్కడే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.

యువతిపై 5 రోజులుగా సామూహిక అత్యాచారం..
ఉత్త్​ర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఓ యువతిని కిడ్నాప్​ చేసి 5 రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కుశీనగర్ జిల్లాలో జరిగింది. ఓ యువతి తన స్నేహితులతో కలిసి బహిర్భూమికి వెళ్లింది. అనంతరం బైక్​పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్​ చేసి.. బిహార్​లోని రంగల్లహి అనే గ్రామానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై 5 రోజులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఆరోగ్య క్షీణించడం వల్ల ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా కేసు ఉపసంహరించుకోవాలని పోలీసులు తమపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలి సోదరుడు ఆరోపించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఓ మహిళతో పాటు ఇద్దరు యువకులపై పల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి :మహిళపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. బైక్​తో ఢీకొట్టి.. దాడి చేసి..

రోడ్డుపై అర్ధరాత్రి మొసలి హల్​చల్​ వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details