దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతూ, సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలపై పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలిని ప్రశ్నించగా.. ఆయన చెప్పిన సమాధానం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న కరోనా టీకాల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని అన్నారు.
"పెట్రోల్ అంత ఖరీదైనది కాదు. కేంద్రం, రాష్ట్రాలు దానిపై పన్నులు విధించాయి. మరోపక్క ప్రభుత్వం ప్రజలందరికి కరోనా టీకాలు ఉచితంగా అందిస్తోంది. మీరు చెల్లించకుండాటీకాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పన్నుల నుంచే టీకా డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వం 130 కోట్ల మందికి ఉచితంగా టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో టీకా డోసు ధర రూ.1,200. ఒక్కొక్కరికి రెండు డోసులు వేయాలి."
-- రామేశ్వర్ తెలి, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి