కర్ణాటకలో వైద్యుడిపై దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నం ఓ వైద్యుడు మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్తుండగా.. కొంత మంది అటకాయించి ఆయనపై దాడికి పాల్పడ్డారు. చిక్కమగళూరులోని తారికేరెలో ఈ ఘటన జరిగింది.
వైద్యుడిపై దాడి- నలుగురు నిందితులు అరెస్టు - attacking a doctor in Chikkamagaluru
కర్ణాటక చిక్కమగళూరులో వైద్యుడిపై దాడి చేసి పరారైన నలుగురు నిందితుల్ని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్ స్పష్టం చేశారు.
![వైద్యుడిపై దాడి- నలుగురు నిందితులు అరెస్టు attacking a doctor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11990528-thumbnail-3x2-1111.jpg)
వైద్యుడిపై దాడి
తమ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా నిందితులు ఆగ్రహానికి గురయ్యారని చిక్కమగళూరు ఎస్పీ తెలిపారు. దీంతో.. చిన్నారి మృతికి వైద్యుడే కారణమని ఆరోపిస్తూ.. ఆయనపై వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు.
ఈ ఘటనపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్నారాయణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వైద్యునిపై దాడి చేసిన నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.