తెలంగాణ

telangana

ETV Bharat / bharat

5,133 సార్లు పాక్​ దాడులు- 46 మంది జవాన్లు మృతి - పాకిస్థాన్​ 2020లో కాల్పుల ఉల్లంఘనలు

సరిహద్దు వెంట పాకిస్థాన్​ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘనల్లో గత ఏడాది 46 మంది భారత సైనికులు మరణించారని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వెల్లడించారు. రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.

Forty-six security personnel killed in ceasefire violations by Pakistan in 2020: Rajnath Singh
'పాక్​ కాల్పుల ఉల్లంఘనల్లో 46 భద్రతా సిబ్బంది మృతి'

By

Published : Feb 8, 2021, 6:13 PM IST

Updated : Feb 8, 2021, 8:16 PM IST

గత ఏడాదిలో 5,133 సార్లు​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్​ ఉల్లఘించిందని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ వెల్లడించారు. ఈ ఘటనల్లో 46 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారని పేర్కొన్నారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.

పాక్ దాడులకు భారత భద్రతా దళాలు సైతం తగిన సమాధానమిచ్చాయని ఆయన చెప్పారు. కాల్పులపై ఇరుదేశాల మిలిటరీ జనరల్స్​ ప్రతివారం సమావేశాలు జరుపుతారని తెలిపారు. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు రేఖ పవిత్రతను కాపాడాలని పాకిస్థాన్​కు ఎన్నోసార్లు నొక్కిచెప్పినట్లు గుర్తుచేశారు రాజ్​నాథ్​.

ఈ ఏడాది 299 సార్లు..

ఈ నూతన ఏడాదిలోనూ జనవరి 28 వరకు అధికారిక లెక్కల ప్రకారం 299 సార్లు కాల్పుల ఉల్లంఘనలు జరిగినట్లు రాజ్​నాథ్​ వెల్లడించారు. 2019లో 3,233సార్లు కాల్పుల ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ కాల్పుల ఉల్లంఘనలతో పాక్​ రెచ్చగొడుతోందని దుయ్యబట్టారు. కశ్మీర్​లోకి ఉగ్రవాదులను పంపిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి:జమ్ముకశ్మీర్​ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Last Updated : Feb 8, 2021, 8:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details