తెలంగాణ

telangana

దేవెగౌడ దంపతులకు కరోనా- మోదీ ఆరా

మాజీ ప్రధాని, జేడీ(ఎస్​) పార్టీ అధినేత హెచ్​డీ దేవెగౌడకు కరోనా పాజటివ్​గా తేలింది. ఆయన భార్య చెన్నమ్మకు కూడా వైరస్ సోకింది. ఈ విషయాన్ని దేవెగౌడ.. ట్విట్టర్​లో తెలిపారు. కరోనా బారిన పడిన వీరి ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఫోన్​ చేసి వారితో మాట్లాడినట్లు ట్వీట్​ చేశారు.

By

Published : Mar 31, 2021, 12:50 PM IST

Published : Mar 31, 2021, 12:50 PM IST

Updated : Mar 31, 2021, 2:57 PM IST

Former Prime Minister and JD(S) leader HD Devegowda have tested positive for COVID-19
మాజీ ప్రధాని దేవెగౌడ దంపతులకు కరోనా

మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడ కరోనా బారిన పడ్డారు. ఆయన భార్య చెన్నమ్మకు కూడా వైరస్​ సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా ఆయనే తెలిపారు. ప్రస్తుతం ఇరువురు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు దేవెగౌడ పేర్కొన్నారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు, తన క్షేమం కోరేవారు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

దేవెగౌడ ట్వీట్​

మోదీ ఆరా...

మోదీ ట్వీట్​

కరోనా బారిన పడిన దేవెగౌడ దంపతుల ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. వారికి ఫోన్​ చేసి మాట్లాడినట్లు ట్విట్టర్​లో వెల్లడించారు. ఇద్దరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

మోదీ ఫోన్​ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాసేపటికే దేవెగౌడ ట్వీట్ చేశారు. "దేశంలో నేను కోరుకున్న ఏ నగరంలోనైనా, ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స చేయించుకోవాలని మోదీ సూచించడం ఆనందకరం. నాకు బెంగళూరులో అంతా బాగుందని, ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తానని ఆయనకు చెప్పా." అని ట్విట్టర్​లో పేర్కొన్నారు మాజీ ప్రధాని.

Last Updated : Mar 31, 2021, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details