వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు(Punjab Assembly Elections) జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లోకి చేరికల పర్వం మొదలైంది. భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దివంగత నేత జ్ఞానీ జైల్ సింగ్ మనవడు(Giani Zail Singh Grandson) ఇంద్రజిత్ సింగ్ భాజపా గూటికి చేరారు. దిల్లీలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
భాజపాలో చేరిన అనంతరం కాంగ్రెస్పై విమర్శలతో విరుచుకుపడ్డారు ఇంద్రజిత్. తన తాత జ్ఞానీ సింగ్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో విధేయతతో పని చేశారని, కానీ పార్టీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు.
తన తాత మరణంపైనా సందేహాలున్నాయని వ్యాఖ్యానించారు ఇంద్రజిత్. ఆయన యాక్సిడెంట్లో చనిపోయారని, కానీ అది ప్రమాదమా? హత్యా? కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు.