తెలంగాణ

telangana

By

Published : Nov 14, 2020, 7:09 PM IST

Updated : Nov 14, 2020, 7:38 PM IST

ETV Bharat / bharat

కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి.!

రాజస్థాన్​లో దారుణం జరిగింది. అధిక మొత్తంలో మద్యం తాగి ఐదుగురి ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

five people died in rajasthan due to over taking liquor
మద్యం భూతానికి ఐదుగురు బలి

రాజస్థాన్​ భరత్​పుర్​ జిల్లాలో మద్యం తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా ఎక్కువమొత్తంలో ఆల్కాహాల్​ తీసుకున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన వారంతా మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే కల్తీ మద్యం తాగడం వల్లే వారి ప్రాణాల మీదకు వచ్చిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపడుతున్నారు.

చనిపోయన వారందరూ మద్యానికి బానిసలు. వారిలో నలుగురికి కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దీంతో శవ పంచనామా చేయడం వీలుపడదు. వారి మృతికి గల కారణాలు తెలియాలంటే కష్టం. ఐదో వ్యక్తి ఉత్తరప్రదేశ్​లోని మథురాలో మరణించారు. అతని పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

Last Updated : Nov 14, 2020, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details