తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోయలో పడిన మినీ బస్సు- ఆరుగురు మృతి - జమ్ముకశ్మీర్​లో ఘోర రోడ్జు ప్రమాదం

accident in jammu kashmir
జమ్మూ కశ్మీర్​ ప్రమాదం

By

Published : Apr 12, 2021, 4:18 PM IST

Updated : Apr 12, 2021, 5:13 PM IST

16:16 April 12

లోయలో పడిన బస్సు- ఆరుగురు మృతి

జమ్ముకశ్మీర్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. దోడా నుంచి కహారాకు వెళుతున్న మినీ బస్సు లోయలో పడిపోయింది. దోడా జిల్లా కేంద్రానికి 42కిమీ దూరంలోని పియాకుల్ గ్రామం వద్ద గల థాత్రి-గండో లోయలో ఈ బస్సు పడిపోయినట్లు దోడా డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

ప్రమాద సమయంలో బస్సులో కనీసం 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటివరకూ ఐదు మృతదేహాలను వెలికి తీశారు అధికారులు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వివరించారు.

Last Updated : Apr 12, 2021, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details