తెలంగాణ

telangana

By

Published : Aug 4, 2021, 2:33 PM IST

Updated : Aug 4, 2021, 7:28 PM IST

ETV Bharat / bharat

వర్షాలకు కూలిన ఇల్లు- ఏడుగురు సజీవ సమాధి

రాజస్థాన్​ బూందీ జిల్లాలో వర్షాల కారణంగా ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు.

house collapsed
కూలిన ఇల్లు, బూందీ

వర్షాల కారణంగా రాజస్థాన్​ బూందీ జిల్లాలో ఇల్లు కూలిపోయింది. మంగళవారం రాత్రి కేశవరాయపాటన్​లో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మొదట ఐదు మృతదేహాలను గుర్తించగా.. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు.

ఐదుగురు సజీవ సమాధి
వర్షాలకు కూలిన ఇల్లు

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది.. శిథిలాల తీవ్రగాయాలతో ఉన్న ఓ మహిళను, బాలికను ఆసుపత్రికి తరలించారు. కానీ, వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.

సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది

ఇదీ చదవండి:స్మార్ట్​ఫోన్​ సాయంతో ఇంటి వద్దే ఈసీజీ పరీక్ష!

Last Updated : Aug 4, 2021, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details