తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శతాబ్ది ఎక్స్​ప్రెస్​లో చెలరేగిన మంటలు - శతాబ్ది ఎక్స్​ప్రెస్ అగ్ని ప్రమాదం

इस घटना में किसी के हताहत होने की जानकारी अब तक नहीं मिली है. रेलवे ने मामले की जांच शुरू कर दी है.

fire-caught-in-coach-of-shatabdi-express-near-rajaji-tiger-reserve-in-haridwar
శతాబ్ది ఎక్స్​ప్రెస్​లో చెలరేగిన మంటలు

By

Published : Mar 13, 2021, 2:28 PM IST

Updated : Mar 13, 2021, 4:32 PM IST

14:26 March 13

శతాబ్ది ఎక్స్​ప్రెస్​లో చెలరేగిన మంటలు

శతాబ్ది ఎక్స్​ప్రెస్​లో చెలరేగిన మంటలు

దిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ రాజధాని దేహ్రాదూన్‌ వెళ్తుండగా  శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. కాన్స్రో సమీపంలోని రాజాజీ టైగర్‌ రిజర్వ్ వద్ద  షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా సీ-5 బోగీలో అగ్నిప్రమాదం సంభవించింది. బోగీ నుంచి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో బోగీ పూర్తిగా కాలిపోయింది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది  హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటల్లో కాలిపోతున్న బోగీని ఇంజిన్‌ నుంచి సాంకేతిక సిబ్బంది వేరు చేశారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే  సీ-5 బోగీలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఆ సమయంలో బోగీలో మొత్తం 35మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. సీ-5 బోగీలోని ప్రయాణికులను ఇతర బోగీల్లోకి పంపినట్లు వివరించారు. అన్ని సాంకేతిక పరీక్షల అనంతరం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ తిరిగి తన గమ్య స్థానానికి బయలుదేరిన్నట్లు  తెలిపారు. సకాలంలో రైల్వే సిబ్బంది స్పందించటంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.

Last Updated : Mar 13, 2021, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details