తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో అగ్ని ప్రమాదం- 200 ఇళ్లు దగ్ధం - బవానా జేజే కాలనీలో అగ్ని ప్రమాదం

దిల్లీలోని ఓ మురికివాడలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి 200 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఫలితంగా అనేక మంది నిరాశ్రయులు అయ్యారు. మంటల వ్యాప్తికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిరాశ్రయులకు తాత్కలిక నివాసం ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

fire accident in bawana jj colony slum, బవానా జేజే కాలనీలో అగ్ని ప్రమాదం
బవానా జేజే కాలనీలో అగ్ని ప్రమాదం

By

Published : Mar 30, 2021, 4:59 PM IST

దిల్లీలోని బవానా జేజే కాలనీలోని మురికివాడలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 200 ఇళ్లు కాలి బూడిదయ్యాయి.

బవానా జేజే కాలనీలో అగ్ని ప్రమాదం

అకస్మాత్తుగా మంటలు చెలరేగగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఇళ్లు మంటలకు కాలిపోవడం వల్ల పలువురు నిరాశ్రయులయ్యారు. సమయానికి ఘటనాస్థలికి చేరిసన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడం వల్ల ఈ నష్టం 200 ఇళ్లకు పరిమితమైందని అధికారులు వెల్లడించారు. లేదంటే మంటలు ఈ మురికివాడలో వేల సంఖ్యలో ఉన్న ఇళ్లు అన్నింటికీ వ్యాపించేవని అభిప్రాయపడ్డారు.

నిరాశ్రయులను తాత్కాలిక శిబిరాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బస్సు టెర్నినల్​లో అగ్ని ప్రమాదం..

నగరంలోని అంతర్రాష్ట్ర బస్సు టెర్నినల్​లో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని 6వ అంతస్తు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంటర్​ స్టేట్​ బస్సు టెర్నినల్​లో అగ్నిప్రమాదం
ఇంటర్​ స్టేట్​ బస్సు టెర్నినల్​లో అగ్నిప్రమాదం

ఇదీ చదవండి :బిహార్​లో ఘోరం- ఆరుగురు చిన్నారులు సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details