తెలంగాణ

telangana

కొవిడ్​ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం- ఆరుగురు మృతి

గుజరాత్​లోని కరోనా ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐసీయూలో ఉన్న ఆరుగురు మృతి చెందారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. మంటలను అదుపులోకి తెచ్చారు.

By

Published : Nov 27, 2020, 11:01 AM IST

Published : Nov 27, 2020, 11:01 AM IST

3 COVID-19 patients killed as fire breaks out at Rajkot hospital
కొవిడ్​ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం- ఆరుగురు మృతి

గుజరాత్​ రాజ్​కోట్​లోని కొవిడ్​ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడం వల్ల.. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురు కరోనా రోగులు మృతిచెందారు.

మావాది ప్రాంతంలోని ఉదయ్​ శివానంద్​ ఆసుపత్రిలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయానికి అందులో మొత్తం 33 మంది కొవిడ్​ బాధితులు ఉండగా.. మిగిలిన 27 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వారిని ఇతర వైద్యశాలకు తరలించినట్టు సమాచారం.

సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే.. ప్రమాదానికి కారణం తెలియరాలేదు.

ప్రధాని విచారం..

రాజ్​కోట్​ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇలా జరగడం దురదృష్టకరమన్న ప్రధాని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. బాధితులకు.. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు మోదీ.

ఇదీ చదవండి:రూ.17వేల కోట్లతో 1.4 కోట్ల మందికి ఉచితవైద్యం!

ABOUT THE AUTHOR

...view details