తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2021, 6:32 PM IST

ETV Bharat / bharat

దిల్లీ ఘటనలో తికాయత్​పై కేసు

రైతు ఆందోళనల్లో హింసపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రైతు నాయకుడు రాకేశ్​ తికాయత్​ సహా మరికొందరిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

FIR against farmer leader Rakesh Tikait over violence during tractor parade
దిల్లీ ఘటనలో తికాయత్​పై కేసు నమోదు

రైతు సంఘం నాయకుడు రాకేశ్​ తికాయత్​పై కేసు నమోదు చేశారు దిల్లీ పోలీసులు. దేశ రాజధానిలో మంగళవారం జరిగిన ఘటనపై ఇప్పటికే పలువురి ఎఫ్​ఐఆర్​ నమోదు చేయగా.. తాజాగా తికాయత్ సహా మరికొందరిపై కేసు పెట్టినట్లు అధికారులు తెలిపారు.

'ఏ రైతు నాయకుడిపై కేసు నమోదైనా.. అది దేశంలోని రైతులపై నమోదైనట్లే' అని ఈ విషయంపై స్పందించారు తికాయత్​.

ఐటీఓ, ఎర్రకోట ఘటనపై ఇప్పటివరకు 22 కేసులు నమోదు చేసి, 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రైతులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో 300 మందికి పైగా పోలీసులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:'గణతంత్ర​ పరేడ్​'పై 22 ఎఫ్​ఐఆర్​లు.. భద్రత కట్టుదిట్టం

ABOUT THE AUTHOR

...view details