తెలంగాణ

telangana

By

Published : Jul 5, 2021, 7:44 PM IST

ETV Bharat / bharat

పెళ్లంటే భయం- కవలలు ఆత్మహత్య!

పెళ్లి చేసుకుంటే తమ బంధం తెగిపోతుందని భయపడ్డ కవలలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలో జరిగింది.

Twin sisters committed suicide in Mandya
పెళ్లైతే విడిపోతామన్న భయంతో కవలలు ఆత్మహత్య

వారిద్దరూ కవలలు. ఇద్దరూ కలిసే పెరిగారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఇక పెళ్లి సమయం వచ్చింది. వారిద్దరికీ పెళ్లిచేసి చెరో ఇంటికి సాగనంపాలని పెద్దలు నిశ్చయించారు. అయితే.. 'పెళ్లైతే మేము విడిపోతాం.. కలిసి ఉండలేం' అని భయపడ్డ ఆ కవలలు బలవన్మరణానికి పాల్పడ్డారు.

కవలలు దీపిక, దివ్య

ఏం జరిగిందంటే..

కర్ణాటక మండ్య జిల్లా శ్రీరంగపట్నం మండలం, హనసనహళ్లి గ్రామానికి చెందిన దీపిక, దివ్య(19) కవలలు. అయితే వారికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. అదే జరిగితే తమ బంధం తెగిపోతుందని భావించిన కవలలు శనివారం సాయంత్రం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఘటనపై అరికేర్​ స్టేషన్​లో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి :Viral Video: వేదికపైనే వరుడిని చెప్పుతో కొట్టిన తల్లి

ABOUT THE AUTHOR

...view details