తెలంగాణ

telangana

By

Published : Nov 13, 2020, 6:44 PM IST

ETV Bharat / bharat

ముగ్గురు పిల్లల్ని చంపి... తానూ ఆత్మహత్య చేసుకొని!

భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన ఓ నేపాల్​​ సంతతికి చెందిన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని తన ముగ్గురు పిల్లల్ని హత్య చేసి.. తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

Benguluru_Suicide
ముగ్గురు పిల్లల్ని చంపి... తనూ ఆత్మహత్య చేసుకొని!

నేపాల్​ సంతతికి చెందిన ఓ వ్యక్తి.. తన ముగ్గురు పిల్లల్ని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం బెంగళూరు సిటీలో జరిగింది.

జనకరాజ్​ కుటుంబం, ఫైల్​ ఫోటో

భార్య మరణాన్ని తట్టుకోలేక...

జనకరాజ్ బిస్తా(32) అనే వ్యక్తి బెంగళూరులో రమణసారి అపార్ట్​మెంట్​లో సెక్యూరిటీ గార్డ్​గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం బిస్తా భార్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో బిస్తా మనస్థాపానికి గురయ్యాడు.

భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన జనకరాజ్​ బిస్తా చావే శరణం అని భావించాడు. తన ముగ్గురు పిల్లలు...సరస్వతి(14), హేమతి(9), రాజ్ కుమార్(3) ను ముందుగా హత్య చేశాడు. తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శవపరీక్ష నిర్వహించేందుకు మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఆరేళ్ల బాలిక...రోజంతా అడవిలోనే!

ABOUT THE AUTHOR

...view details