తెలంగాణ

telangana

By

Published : Apr 21, 2022, 2:01 PM IST

Updated : Apr 21, 2022, 2:47 PM IST

ETV Bharat / bharat

పెళ్లికి డబ్బులు లేవని కూతురినే చంపిన తండ్రి

Father Killed Daughter: పెళ్లి చేయడానికి డబ్బులు లేవనే కారణంతో కన్న కూతురినే హత్య చేశాడు ఓ తండ్రి. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని నాందేడ్​లో జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన వివాహా వేడుకల్లో కాల్పులు జరపగా.. 4 ఏళ్ల బాలుడు మరణించాడు.

Father Killed Daughter
Father Killed Daughter

Father Killed Daughter: మహారాష్ట్ర నాందేడ్​లో విషాదకర ఘటన జరిగింది. పెళ్లికి డబ్బులు లేవనే కారణంతో సొంత కూతురినే హత్య చేశాడు ఓ తండ్రి. కూతురి వివాహం కోసం ఇంట్లో గొడవ జరగడం వల్ల బాలాజీ అనే వ్యక్తి తన కుమార్తె సింధును కర్రతో కొట్టి చంపాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇదీ జరిగింది: నాందేడ్​ ముఖేద్​లోని జామ్​ఖేడ్​ గ్రామానికి చెందిన బాలాజీ విశ్వంభర్​ దేవకటేకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల బాలాజీ కుమార్తె సింధుకు పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే, గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న అతడి వద్ద.. కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేవు. దీంతో పెళ్లికి డబ్బులు ఎక్కడ నుంచి తేవాలంటూ మనస్తాపానికి గురైన బాలాజీ.. కూతురిని కర్రతో కొట్టడం ప్రారంభించాడు. అడ్డుకోబోయిన భార్యను సైతం కొట్టాడు. తీవ్ర రక్తస్రావమైన ఆ యువతి అక్కడిక్కడే మరణించింది.

వివాహ వేడుకల్లో విషాదం: ఉత్తర్​ప్రదేశ్​ ఫరూఖాబాద్​ జిల్లాలో ఆనందంతో జరగాల్లిన వివాహ వేడుకలు విషాదాన్ని నింపాయి. మహ్మదాబాద్​ ఖిమ్సేపుర్​లోని కిషన్​పాల్​ జాతవ్​ ఇంట్లో వివాహ అనంతరం తిలక్​ వేడుకులు జరిగాయి. ఈ క్రమంలోనే అనందంతో ఉన్న కుటుంబ సభ్యులు తూపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కుబేర్​పుర్​కు చెందిన 4 ఏళ్ల దినేశ్​ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది:సోషల్​ మీడియాలో స్నేహం.. ఆ వీడియోలతో బెదిరించి అత్యాచారం!

Last Updated : Apr 21, 2022, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details