కరోనా వ్యాప్తి వేళ నిబంధనలు ఉల్లంఘించి వివాహం చేశారని పెళ్లి కూతురు తండ్రికి రూ. లక్ష జరిమానా విధించారు అధికారులు. చాలానా నగదు జమ చేయాలని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. దీంతో చేసేది ఏమీ లేక తన పొలాన్ని తాకట్టు పెట్టి జరిమానా సొమ్మును చెల్లించాడు. కానీ అనారోగ్యంతో, తీవ్ర మనస్తాపంతో అతను మరుసటి రోజునే చనిపోయాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్ కాప్రేన్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది.
ఆదిలా గ్రామానికి చెందిన అక్షజిత్, బ్రిజ్మోహన్ మీనా దంపతులు తమ కూతురికి మే14న వివాహం జరిపించారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాజస్థాన్లో మే30 వరకు లాక్డౌన్ విధించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ వివాహాలను జరిపించుకోవచ్చని పేర్కొన్నారు.
పెళ్లి జరుగుతున్న విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని గ్రామ ప్రజలు గుమికూడారు. నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి జరిపిస్తున్నావంటూ పెళ్లికూతురు తండ్రికి అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. అందుకు అధికారులు వచ్చాక గుమికూడిన వారిని వీడియో తీసి ఇదే అందుకు సాక్ష్యం అని చెప్పారు.