తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఫసల్​ బీమాతో కోట్లాది రైతులకు లబ్ధి' - నరేంద్ర మోదీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్​ బీమా యోజన ప్రారంభించి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పీఎం-ఎఫ్​బీవైని కొనియాడుతూ ట్వీట్​ చేశారు ప్రధాని మోదీ. ఈ పథకం ద్వారా కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు.

PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

By

Published : Jan 13, 2021, 12:48 PM IST

తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పంట బీమా పథకం 'పీఎం ఫసల్​ బీమా యోజన'.. ప్రకృతి విపత్తులతో వచ్చే పంట నష్టాన్ని తగ్గించి కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఫసల్​ బీమా యోజన ప్రారంభించి నేటితో ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మేరకు ట్వీట్​ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​

" ప్రకృతి విపత్తుల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు ప్రారంభించిన పీఎం ఫసల్​ బీమా యోజన ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం బీమా కవరేజీని పెంచింది. నష్టం ముప్పును తగ్గించింది. కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. ఈ పథకం లబ్ధిదారులందరినీ నేను అభినందిస్తున్నా."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

'పీఎం ఫసల్​ బీమా యోజన ద్వారా రైతులకు ఏవిధంగా ప్రయోజనం కలుగుతోంది? బీమా చెల్లింపుల్లో ఎంతమేర పారదర్శకత ఉంది? వంటి అంశాలే కాక పీఎం-ఎఫ్​బీవైకు సంబంధించిన ఇతర అంశాలపై నమో యాప్​లోని యువర్​ వాయిస్​ విభాగం ద్వారా తెలుసుకోవచ్చు' అని పోస్ట్ చేశారు మోదీ.

ఇదీ చూడండి:లోరీ మంటల్లో సాగు చట్టాల ప్రతులు!

ABOUT THE AUTHOR

...view details