తెలంగాణ

telangana

By

Published : Jul 8, 2021, 7:08 AM IST

ETV Bharat / bharat

Farmers Protest: పెట్రోల్​ ధరల పెంపునకు వ్యతిరేకంగా రైతుల నిరసన

పెట్రోల్​ ధరల పెంపును వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా. గురువారం రెండు గంటల పాటు రైతులు నిరసన చేపట్టనున్నట్లు పేర్కొంది.

farmers
రైతులు, నిరసన

పెట్రోల్​ ధరల పెంపునకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్​కేఎం) పిలుపునిచ్చింది. ఈ మేరకు రైతులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు ఎస్​కేఎం​ తెలిపింది.

"సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు గురువారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు దేశవ్యాప్తంగా రైతులు నిరసన చేపట్టనున్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్​ ధర పెంపునకు వ్యతిరేకంగా దాదాపు 2 గంటల పాటు ఈ నిరసనకు దిగనున్నారు."

--సంయుక్త కిసాన్ మోర్చా.

రైతులు.. నిరసన కేంద్రాలకు మోటార్​ వాహనాల్లో, ట్రాక్టర్లలో, కార్లలో, ట్రక్కుల్లో వస్తారని, వీలైతే ఖాళీ గ్యాస్​ సిలిండర్లు తీసుకురానున్నారని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. బుధవారం దిల్లీ, కోల్​కతా ప్రాంతాల్లో పెట్రోల్​ ధర లీటర్​కు రూ. 100 దాటిన నేపథ్యంలో ఈ నిరసనకు పిలుపునిచ్చినట్లు తెలిపింది. ధరల పెంపు ప్రభావం సమాజంలోని అన్ని వర్గాల వారిపై ఉంటుందని ఎస్​కేఎమ్​ వెల్లడించింది. తమ నిరసనతోనైనా ప్రభుత్వం ధరలను తగ్గించాలని డిమాండ్ చేసింది.

ఇదీ చదవండి:రాజ్​భవన్ల ఎదుట నిరసనలకు సన్నద్ధం

ABOUT THE AUTHOR

...view details