తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి వేడుక కోసం వచ్చి.. హింసకు ఆ 'రైతు' బలి - దిల్లీ రైతు మృతి

దిల్లీ హింసలో ఐటీఓ వద్ద ట్రాక్టర్​ బోల్తా కొట్టిన ఘటనలో మృతిచెందిన రైతును ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన నవ్రీత్​గా గుర్తించారు. అయితే 27ఏళ్ల నవ్రీత్​.. తన మామ బలవంతంతోనే ఆందోళనల్లో పాల్గొన్నాడు. వాస్తవానికి.. ఆస్ట్రేలియాలో ఉంటున్న నవ్రీత్​.. కొద్ది కాలం క్రితం అక్కడే పెళ్లి చేసుకున్నాడు. వేడుకలు జరుపుకునేందుకు దేశానికి వచ్చాడు. బుధవారం వేడుకలు జరగాల్సి ఉండగా.. మంగళవారం రాత్రి అతని మృతదేహం ఇంటికి చేరింది.

Farmer who died at ITO protest had returned from Australia recently to celebrate his wedding
వేడుక కోసం దేశానికి వచ్చి.. హింసకు ఆ 'రైతు' బలి

By

Published : Jan 27, 2021, 5:24 PM IST

దిల్లీ హింసలో ఐటీఓ వద్ద ఓ ట్రాక్టర్​ బోల్తా కొట్టి.. అందులోని రైతు మృతిచెందిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన నవ్రీత్​గా గుర్తించారు. విదేశాల్లో పెళ్లి చేసుకుని.. వేడుకల కోసం భారత్​కు వచ్చిన అతడు.. ఇలా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది.

మామ ఒత్తిడితో..

27ఏళ్ల నవ్రీత్ సింగ్​​.. కొన్ని రోజుల ముందే ఆస్ట్రేలియా నుంచి ఉత్తర్​ప్రదేశ్​లోని సొంత ఊరు రామ్​పుర్​కు వచ్చాడు. ఇటీవలే ఆస్ట్రేలియాలోనే పెళ్లి చేసుకున్న అతడు.. బుధవారం బంధువులు, స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.

ఇంతలో దిల్లీలో మంగళవారం జరిగిన ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొనేందుకు తనతో పాటు రావాలని నవ్రీత్​ మామ.. అతడ్ని బలవంతం చేశాడు. అందుకు అంగీకరించి దిల్లీ వెళ్లిన నవ్రీత్​.. ఇంటికి శవమై తిరిగివచ్చాడు.

ఇదీ చూడండి:-దిల్లీ హింసపై షా వరుస సమీక్షలు

నిరసనల్లో పాల్గొన్న నవ్రీత్​.. ట్రాక్టర్​ మీద అతివేగంతో ఐటీఓ వైపు దూసుకెళ్లాడు. అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ట్రాక్టర్​ బలంగా ఢీకొట్టింది. దీంతో క్షణాల్లోనే ట్రాక్టర్​ బోల్తా కొట్టింది. అందులో ఉన్న నవ్రీత్​ తీవ్రగాయాలతో మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు మంగళవారం సాయంత్రం విడుదల చేశారు.

ఐటీఓ వద్ద ట్రాక్టర్​ బోల్తా దృశ్యాలు

మంగళవారం రాత్రి నవ్రీత్​ మృతదేహం రామ్​పుర్​కు చేరుకుంది. ఆ తర్వాత డిబ్దిబా గ్రామానికి అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తరలించారు.

వేడుకలు జరగాల్సిన నవ్రీత్​ నివాసం.. ఇప్పుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. అతడి మృతికి సంఘీభావం తెలిపేందుకు పరిసర ప్రాంత ప్రజలు నవ్రీత్​ ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు తరలివెళ్లారు.

కాల్పులు జరపలేదు..

అయితే పోలీసుల కాల్పుల్లోనే నవ్రీత్​ మృతిచెందాడని ఊహాగానాలు జోరందుకున్నాయి. తాము అతడిపై కాల్పులు జరపలేదని, వీడియోలోనూ ఆనవాళ్లు లేవని పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:-దిల్లీ హింసాత్మక ఘటనలపై సుప్రీంలో వ్యాజ్యం

ABOUT THE AUTHOR

...view details