కుమారుడి ప్రవర్తన నచ్చక ఓ తండ్రి తన ఆస్తిలో సగం వాటాను పెంపుడు శునకం పేరున రాశాడు . ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛింద్వాడా జిల్లాలో జరిగింది.
బరిబాడ గ్రామానికి చెందిన ఓం నారాయన అనే వ్యక్తికి తన పెంపుడు శునకం (జాకీ) అంటే చాలా ఇష్టం. కుమారుడి ప్రవర్తనతో కోపగించుకున్న నారాయణ ..పెంపుడు శునకం(జాకీ) పేరున తన ఆస్తిలో సగాన్ని రాసిచ్చాడు. మిగతా సగాన్ని తన రెండో భార్య చంపావర్మకు ఇస్తున్నట్లు వీలునామాలో పేర్కొన్నాడు.
"నా భార్య, జాకీ(శునకం) నన్ను బాగా చూసుకుంటున్నారు. అందుకే నా ఆస్తి మొత్తాన్ని వీరిద్దరి పేరున రాస్తున్నాను. నేను చనిపోయిన తరువాత నా ఆస్తి అంతా వీరికే చెందుతుంది. అంతేకాదు జాకీని ఎవరైతే చూసుకుంటారో దానిపేరున ఉన్న ఆస్తికి వారే వారసులు అవుతారు."