తెలంగాణ

telangana

By

Published : Nov 14, 2020, 9:04 PM IST

ETV Bharat / bharat

దీప కాంతులతో ఆలయాలకు కొత్త శోభ

దీపపు ప్రమిదల కాంతితో దేవాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. దీపావళి సందర్భంగా ... పంజాబ్​లోని అమృత్​ సర్​ దేవాలయం, బద్రీనాథ్​ మొదలైన ప్రముఖ దేవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Temples_Diwali
దీపాల వెలుగులో కళకళలాడుతోన్న ఆలయాలు

దీపాల వెలుగులో దేశంలోని పలు దేవాలయాలు కళకళలాడుతున్నాయి. దీపావళి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలను సందర్శిస్తున్నారు. 'బందీ చోర్ ​దివస్' సందర్భంగా పంజాబ్​లోని అమృత్​సర్ దేవాలయం విద్యుద్దీపాల కాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది. మరోవైపు భక్తులు సైతం దేవాలయం చట్టూ నూనె దీపాలు వెలిగించారు.

పంజాబ్​లోని అమృత్​ దేవాలయం వద్ద దీపాలు వెలిగిస్తోన్న భక్తులు
విద్యుద్దీపాల వెలుగులో గోల్డెన్ టెంపుల్

ఉత్తరాఖండ్​లోని బద్రీనాథ్​ దేవాలయాన్ని భారీ సంఖ్యలో సందర్శించారు భక్తులు. దీపావళి పండగ సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు.

పర్యటకులను ఆకర్షిస్తోన్న బద్రీనాథ్ ఆలయం

ఇదీ చదవండి:ఇవి కాల్చే టపాసులు కాదు.. నోరారా తినేవి

ABOUT THE AUTHOR

...view details