దేశంలో కరోనా టీకా డోసుల కొరత నేపథ్యంలో కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. జులై-ఆగస్టు కల్లా దేశంలో అందరికీ సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కొవిడ్ పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.
"వ్యాక్సిన్లపై కాంగ్రెస్ పలు ఆరోపణలు చేస్తోంది. ఇది చాలా బాధాకరమైన విషయం. జులై-ఆగస్టు కల్లా దేశంలో సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి."