తెలంగాణ

telangana

ETV Bharat / bharat

70 అడుగుల గుంతలో చిక్కుకున్న ఇంజినీర్​.. రాత్రి నుంచి శిథిలాల కిందే! - పంజాబ్​ లేటెస్ట్ న్యూస్

Engineer Stuck In Well In Punjab : ఎక్స్​ప్రెస్​ వే నిర్మాణంలో పనిచేస్తున్న ఓ ఇంజినీర్​ ప్రమాదవశాత్తు 70 అడుగుల లోతు గుంతలో పడిపోయాడు. ఈ ఘటన శనివారం రాత్రి జరగగా.. సమాచారం అందుకున్న రెస్కూ బృందం సహాయక చర్యలు చేపట్టింది.

engineer stuck in well in Punjab
సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది

By

Published : Aug 13, 2023, 2:02 PM IST

Updated : Aug 13, 2023, 2:27 PM IST

Engineer Stuck In Well In Punjab :70 అడుగుల లోతు గుంతలో చిక్కుకుపోయాడు ఓ ఇంజినీర్​. దిల్లీ-జమ్ము-కట్​ఢా ఎక్స్​ప్రెస్ వే పనుల్లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న ఓ ఇంజినీర్ ప్రమాదవశాత్తు గుంతలో చిక్కుకుపోయాడు. ఈ ఘటన పంజాబ్​లోని జలంధర్​లో శనివారం రాత్రి 10 గంటలో సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇదీ జరిగింది
సురేశ్ యాదవ్​ అనే వ్యక్తి దిల్లీ-జమ్ము-కట్​ఢా ఎక్స్​ప్రెస్​ వే ప్రాజెక్ట్​లో ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 10 గంటల సమయంలో నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నాడు. కర్తార్​పుర్​ సమీపంలోని బస్రంపుర్​ గ్రామంలో నిర్మాణంలో భాగంగా 70 అడుగులు లోతైన గుంతను తవ్వారు. ఈ సమయంలోనే ఇంజినీర్​ సురేశ్​తో పాటు మరో కార్మికుడు గుంతలోకి దిగి పనులను పరిశీలిస్తున్నారు. అయితే.. పైన ఉన్న మట్టి దిబ్బలు ఒక్కసారిగా కూలిపోయాయి. దీంతో అప్రమత్తమైన కార్మికుడు హుటాహుటిన బయటకు రాగా.. సురేశ్​ మాత్రం అందులోనే చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

కొనసాగుతున్న సహాయక చర్యలు

సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి
ఈ ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న రాష్ట్ర మంత్రి బల్కర్​ సింగ్​.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా సహాయక చర్యలు చేపట్టి.. ఇంజినీర్​ను రక్షించాలని సూచించారు. మంత్రితో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి

బావిలో చిక్కుకుని కార్మికుడు మృతి
అంతకుముందు నెల రోజుల క్రితం ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. తిరువనంతపురంలో పైపులు దింపడానికి 100 అడుగుల బావిలోకి దిగి.. చిక్కుకుపోయి ఓ వ్యక్తి మరణించాడు. మట్టి పెళ్లలు పైన పడటం వల్ల 48 గంటలుగా బావిలోనే నరకయాతన అనుభవించాడు. అంతకుముందు వారి వద్ద ఉన్న పరికరాలతో బాధితుడ్ని బయటకు తీయడం సాధ్యం కాకపోవడం వల్ల.. ఇతర ప్రాంతాల నుంచి అధునాతన పరికరాలను తెప్పించారు. ఆ తర్వాత కొల్లాం నుంచి నిపుణుల బృందాన్ని తీసుకువచ్చి సహాయక చర్యలు చేపట్టారు. మట్టి పెళ్లలు కూలకుండా చెక్కలను అడ్డం పెట్టారు. అతడిని కాపాడేందుకు సహాయక సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు దాదాపు 48 గంటల తర్వాత మట్టిలో కూరుకుపోయిన తమిళనాడుకు చెందిన 55 ఏళ్ల మహారాజన్ మృతదేహాన్ని వెలికితీశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బోరుబావిలో పడ్డ 2ఏళ్ల బాలిక సేఫ్​.. బకెట్​ సాయంతో బయటకు..

బోరు బావిలో పడి చిన్నారి మృతి.. కాపాడేందుకు 19 గంటలు శ్రమించినా..

Last Updated : Aug 13, 2023, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details