తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మమతకు ఈసీ ఘాటు లేఖ - EC letter to Mamata

అధికార పార్టీకి ఈసీ మద్దతుగా వ్యవహరిస్తోందంటూ పదేపదే మమత ఆరోపించటాన్ని ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఇది రాజ్యంగబద్ధ సంస్థలను తక్కువ చేయటమేనని మండిపడింది. ఈ మేరకు సీఎం మమతకు ఘాటుగా లేఖ రాసింది ఈసీ.

EC to Mamata: Do not belittle institution with repeated innuendos
దీదీకి ఈసీ ఘాటు లేఖ

By

Published : Mar 17, 2021, 5:09 AM IST

Updated : Mar 17, 2021, 9:15 AM IST

బంగాల్​ సీఎం మమతా బెనర్జీకి.. కేంద్ర ఎన్నికల సంఘం ఘాటు లేఖను పంపింది. అధికార పార్టీకి ఈసీ మద్దతుగా వ్యవహరిస్తోందంటూ పదేపదే ఆమె ఆరోపించటాన్ని ఈసీ తప్పుపట్టింది. ఇది రాజ్యంగబద్ధ సంస్థలను తక్కువ చేయటమేనని మండిపడింది.

మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మమత.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నుంచి ఎన్నికల కమిషన్‌ సలహాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం విధుల్లో భాజపా జోక్యం చేసుకోవడం కొనసాగిస్తే.. ఈసీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

బంగాల్‌ ఎన్నికల ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న సుదీప్ జైన్‌ను ఆ బాధ్యతలను నుంచి తప్పించాలని టీఎంసీ డిమాండ్‌ చేయగా.. ఎన్నికల కమిషన్‌ అందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో వరుసపెట్టి ఎన్నికల సంఘం పనితీరుపై మమత తీవ్ర విమర్శలు చేయటాన్ని ఖండించిన ఈసీ.. ఈ మేరకు లేఖను పంపింది.

ఇదీ చూడండి:'ఆర్టికల్​ 370 రద్దు తర్వాత 31 మంది పౌరులు మృతి'

Last Updated : Mar 17, 2021, 9:15 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details