బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కాలికి గాయం అయ్యేందుకు దాడి కారణం కాదని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధరించినట్లు తెలిసింది. ఎన్నికల పరిశీలకులు, బంగాల్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. భద్రతా వైఫల్యాల వల్లే ఈ ఘటన జరిగినట్లు ఈసీ భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ విషయంపై త్వరలో ఈసీ పలు ఆదేశాలు జారీ చేసే అవకాశముందని ఆయా వర్గాలు వెల్లడించాయి. స్టార్ క్యాంపెయినర్ అయినప్పటికీ.. మమత బులెట్ ప్రూఫ్ వాహనం వినియోగించకపోవడం భద్రతాపరమైన వైఫల్యమేనని ఈసీ భావిస్తున్నట్టు పేర్కొన్నాయి.
నందిగ్రామ్లో..