బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ చీఫ్ హగ్రామ మొహిలరీను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేసిన అసోం మంత్రి, భాజపా సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మకు ఊరట లభించింది. ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఎన్నికల సంఘం శనివారం అనుమతి ఇచ్చింది.
హగ్రామా మొహిలరీపై హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం.. ఆయన ప్రచా రంపై 48 గంటల పాటు నిషేధించింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరుతున్నానని, ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్నందున తన ప్రచారానికి అవకాశం ఇవ్వాలని ఆయన ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిం చారు.
దీంతో, ఎన్నికల నియమావళికి లోబడే ప్రచారం నిర్వహించాలంటూ షరతులు విధించిన ఎన్నికల సంఘం.. ఆయన పై ఉన్న నిషేధాన్ని 48 గంటల నుంచి 24 గంటలకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
'ఎన్నికల సంఘాన్ని చరిత్ర క్షమించదు'