అసోం గువాహటిలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అక్కడే పని చేస్తోన్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గువాహటి వైద్య కళాశాలకు తరలించారు.
కుప్పకూలిన రైల్వే వంతెన.. ఇద్దరు కూలీలు మృతి - గువాహటిలోని ఈశాన్య సరిహద్దు రైల్వే
అసోం గువాహటిలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
![కుప్పకూలిన రైల్వే వంతెన.. ఇద్దరు కూలీలు మృతి 2 killed in Assam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10618453-997-10618453-1613254998830.jpg)
అసోంలో బ్రిడ్జి కూలి ఇద్దరు కూలీల మృతి
గువాహటిలోని ఈశాన్య సరిహద్దు రైల్వే(ఎన్ఎఫ్ఆర్) అండర్ బ్రిడ్జ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఓ అధికారి తెలిపారు. ఈ ఆకస్మిక ఘటనలో మరో ఏడుగురు కూలీలను స్థానిక సిబ్బంది కాపాడినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:'ఆ సరస్సుతో ఇక ప్రమాదం లేదు'