తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గణేశ్​ స్టాంపుల్లో డ్రగ్స్​ సరఫరా- ఇద్దరు అరెస్ట్​ - గణేశ్​ స్టాంపుల్లో డ్రగ్స్​ సరఫరా

బెంగుళూరు పోలీసులు.. గణేశ్​ ఫొటో స్టాంపుల్లో డ్రగ్స్​ను సరఫరా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో స్టాంపును రూ. 4వేలకు అమ్ముతున్నట్టు గుర్తించారు. మొత్తం రూ. 15లక్షలు విలువగల మాదకద్రవ్యాలను జప్తు చేసి.. కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Drugs supply in Ganapathi Photo Stamp in Bangalore
గణేశ్​ స్టాంపుల్లో డ్రగ్స్​ సరఫరా- ఇద్దరు అరెస్ట్

By

Published : Nov 30, 2020, 7:43 PM IST

గణేశ్​ ఫొటో స్టాంపుల్లో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాలోని ఇద్దరిని బెంగళూరు సీసీబీ(సెంట్రల్​ క్రైమ్​ బ్రాంచ్​) పోలీసులు అరెస్ట్​ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరిని కేరళకు చెందిన అరుణ్​ ఆంటోని, గణేశ్​, అమల్​ బైజుగా గుర్తించారు.

గణేశ్​ స్టాంపులు
వివిధ రకాల స్టాంపుల్లో డ్రగ్స్​

అరుణ్​ అంటోని.. హెబ్బుగొడి వద్ద జిరాక్స్​ టెక్నీషియన్​గా పనిచేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కేరళ కొట్టాయం నుంచి డ్రగ్స్​ కొరియర్​లో వచ్చినట్టు గుర్తించామని పేర్కొన్నారు. నాలుగు నెలల్లో.. మొత్తం రూ.15 లక్షలు విలువగల డ్రగ్స్​ ఉన్న 400కుపైగా స్టాంపులను జప్తు చేసినట్టు తెలిపారు.

నిందితుడు అరుణ్​
నిందితుడు గణేశ్​

ఒక్కో స్టాంపును ఈ ముఠా రూ.4వేలకు అమ్ముతోంది. పబ్​లు, పార్టీలకు వీటిని సరఫరా చేస్తున్నట్టు నిందితులు అంగీకరించారు.

ఇదీ చూడండి:-గుండీల్లో హెరాయిన్​ సప్లై- డ్రగ్​ రాకెట్​ గుట్టురట్టు

ABOUT THE AUTHOR

...view details