తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోట్ల విలువైన డ్రగ్స్​ సీజ్​.. అడ్డంగా బుక్కైన నిందితులు.. సీఎం ప్రశంసలు

Drugs seized in Assam: సరిహద్దు ప్రాంతాల గుండా మాదక ద్రవ్యాలను చేరవేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు అసోం పోలీసులు. ఓ ట్రక్కులో భారీగా డ్రగ్స్​ తరలిస్తుండగా పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్​ చేశారు.

By

Published : Apr 15, 2022, 10:55 AM IST

Assam Police Seize Drugs
డ్రగ్స్​ సీజ్​

Drugs seized in Assam: అంతరాష్ట్ర డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు చేశారు అసోంలోని కాచర్​ జిల్లా పోలీసులు. జిరిఘాట్​ ప్రాంతంలో సుమారు రూ.42 కోట్లు విలువైన మాదకద్రవ్యాలను గురువారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్​ చేసినట్లు కామరూప్​ స్టేషన్​ పోలీసులు తెలిపారు. పట్టుకున్న డ్రగ్స్​లో అర కిలో హెరాయిన్​, 1.5 లక్షల యాబా మాత్రలు ఉన్నట్లు చెప్పారు.

అసోం పోలీసులు పట్టుకున్న డ్రగ్స్​

జాయింట్​ కమీషనర్​ ఆఫ్​ పోలీస్​ పార్థ సారధి మహంతా నేతృత్వంలో జిల్లాలోని సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఓ ట్రక్కును తనిఖీ చేయగా భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. అరెస్ట్​ చేసిన ముగ్గురిలో ఇద్దరు ఫిరోఖాన్​, ఎలియాస్​ ఖాన్​లు సరిహద్దు రాష్ట్రం మణిపుర్​కు చెందిన వారు కాగా.. సద్దామ్​ అలియాస్​ సమినుల్​ హఖ్​ బంగాల్​లోని కూచ్​ బిహార్​ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

పట్టుకున్న మాదకద్రవ్యాలు

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులపై ప్రశంసలు కురిపించారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. 'జేసీపీ పార్థ సారధి మహంత, డీఎస్​పీ కల్యాణ్​ పాఠక్​ నేతృత్వంలో మరో డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు చేశారు. కాచర్​ సరిహద్దులో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను పట్టుకున్నారు. 0.5 కిలోల హెరాయిన్​, 1.5 లక్షల యాబా ట్యాబ్లెట్లు సీజ్​ చేశారు.' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రూ.15వేల కోసం బాలికను చంపిన యువకుడు.. ఆపై ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details