తెలంగాణ

telangana

'నందిగ్రామ్​ గురించి చింతించొద్దు.. తీర్పు ఏదైనా ఓకే'

By

Published : May 2, 2021, 6:37 PM IST

నందిగ్రామ్​ గురించి చింతించొద్దని ప్రజలకు సూచించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అక్కడి ప్రజల తీర్పును అంగీకరిస్తామన్నారు. ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Mamata banerjee
బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో తిరుగులేని పార్టీగా అవతరించింది తృణమూల్​ కాంగ్రెస్​. మూడోసారి అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజారిటీ సాధించింది. ఈ క్రమంలో ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నందిగ్రామ్​ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు.

" ఎన్నికల్లో ఘన విజయం అందించిన ప్రజలకు నా కృతజ్ఞతలు. వెంటనే కొవిడ్​-19పై పోరాటాన్ని ప్రారంభిస్తాను. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనేది చాలా చిన్న అంశం. ఎన్నికల్లో భాజపా ఓడిపోయింది. వారు స్వార్థ రాజకీయలు చేశారు. ఎన్నికల సంఘం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నందిగ్రామ్​ గురించి చింతించకండి. నందిగ్రామ్​ కోసం నేను పోరాడాను. నందిగ్రామ్​ ప్రజలకు కావాల్సిన తీర్పును ఇవ్వనివ్వండి. దానిని నేను అంగీకరిస్తా. మేము 221కుపైగా సీట్లు సాధించాం. భాజాపా ఓడిపోయింది. "

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

ABOUT THE AUTHOR

...view details