తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2021, 2:49 PM IST

ETV Bharat / bharat

4000 కి.మీ పాదయాత్రతో కరోనా యోధులకు సలాం!

మానవాళిని కబళిస్తున్న కరోనా కోరలు పీకడానికి విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్న యోధులను అభినందించాలనుకున్నాడు ఓ యువకుడు. వారి గురించి యువతలో అవగాహన కల్పించాలని సంకల్పించాడు. ఏకంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్​కు కాలి బాటన పయనించాడు.

Don't Care for Asthma.. Padayatra for congratulating Corona warriors
కరోనా యోధులకే కాదు.. నీకూ సలామ్​!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాతో ఏడాదికిపైగా ముందుండి పోరాడుతున్నారు వైద్యులు, పారిశుద్ధ్య, పోలీసులు సహా ఇతర సిబ్బంది. బయటకు వెళ్లాలంటేనే గజగజ వణికే సమయంలో ప్రజలకు వైద్యం, ఆహారం, భద్రత అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అంతటి అసమాన సేవలు అందిస్తున్నవారిని ఓ యువకుడు అభినందించాలనుకున్నాడు. కరోనా యోధులపై యువతకు అవగాహన కల్పించడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్​ వరకు పాదయాత్ర చేపట్టాడు. అతడే కర్ణాటకకు చెందిన భరత్ పీఎన్.

కశ్మీర్​లో కరునాడ జెండా ఆవిష్కరణ

ఎగసిన జెండా..

డిసెంబర్ 11న కన్యాకుమారిలో తన పాదయాత్ర మొదలుపెట్టాడు భరత్. ఇటీవలే కశ్మీర్​ చేరుకున్నాడు. తనతో పాటు తీసుకెళ్లిన కరునాడ జెండాను కర్ణాటక జవాన్లతో కలిసి ఎగరవేశాడు.

భరత్ పీఎన్

ప్రకృతిపై ప్రేమ..

భరత్​ది చమరాజనగర జిల్లాలోని కొల్లేగల. టీవీ డీటీహెచ్​ల సర్వీస్ ప్రొవైడర్​గా పనిచేస్తున్నాడు. వాక్ ఫర్ యూనిటీ పేరుతో విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నాడు. అతడూ రోజకు 45-50కి.మీల పాటు నడిచేవాడు.

అంతులేని ఆత్మవిశ్వాసం..

భరత్​.. ఆస్తమా బాధితుడు. అయితే ఆత్మవిశ్వాసం, తెగువకు అతడు చిరునామా. శ్వాస సమస్య ఉన్నప్పటికీ అతడు 4 వేల కి.మీలు నడిచాడు. సైక్లింగ్​ కూడా చేస్తాడు. పర్వతారోహణలో దిట్ట.

భద్రతా సిబ్బందితో భరత్

పోలీసుల సత్కారం..

ఈ యాత్రలో ప్రభుత్వం నుంచి భరత్​కు ఎలాంటి ఆర్థిక సహకారం, గుర్తింపు లభించలేదు. తన స్నేహితులు సహాయం చేసేవారని అతను చెబుతున్నాడు. పాదయాత్రలో పండ్లు, ఆహారం తప్ప డబ్బు రూపేణా చేయూత అందేది కాదు. ఈ ప్రయాణంలో అతడు 150 మొక్కలు నాటాడు. కశ్మీర్​ పోలీసులు భరత్​ను సత్కరించడం విశేషం.

ఇదీ చూడండి:రేప్ కల్చర్​ను అంతమొందించండిలా..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details