పంజాబ్లోని వైద్యులు ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి.. ఓ మహిళ కడుపులో నుంచి దాదాపు 3.5 కిలోల బరువున్న కణితిని తొలగించారు. ఎంతో ఖర్చుతో కూడుకునే ఆ శస్త్రచికిత్సను తక్కువ ధరకే చేసి ఆమెకు పునర్జన్మ అందించారు. ఈ అరుదైన శస్త్రచికిత్స శుక్రవారం జరిగినట్లు ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు.
మహిళకు అరుదైన శస్త్రచికిత్స.. 3.5 కిలోల కణితి తొలగించిన వైద్యులు - పంజాబ్ అమృత్సర్ లేటెస్ట్ న్యూస్
పంజాబ్ వైద్యులు ఓ అరుదైన ఆపరేషన్ చేశారు. ఓ మహిళ పొట్టలోనుంచి 3.5 కిలోల కణితిని తొలగించారు. ఎన్నో ఆస్పత్రిలు తిరిగి అక్కడకు చేరుకున్న ఆమెకు.. ఆ వైద్యులు పునర్జన్మ అందించారు.

అమృత్సర్లోని బల్జీందర్ సింగ్ భార్య.. కుల్బీర్ కౌర్ గత కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమెకు వైద్యపరీక్షలు చేయగా.. కడుపులో ఓ పెద్ద కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చాలా ఆస్పత్రిలకు వెళ్లగా అక్కడ డాక్టర్లు అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో వారు నాగ్కలాన్లోని బాబా ఫరీద్ ఛారిటబుల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ రాజ్బీర్ సింగ్ బజ్వా అతితక్కువ ఖర్చుతోనే ఆమెకు ఆపరేషన్ చేశారు. నాలుగు గంటలపాటు శ్రమించిన వైద్యులు.. దాదాపు 3.5 కిలోలా బరువున్న కణితిని ఆ మహిళ కడుపు నుంచి తొలగించి పునర్జన్మ అందించారు.