తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రపంచంలోనే తొలి మెగా ఈవెంట్​ ఇదే' - raj nath singh at aero india

ఎన్నో కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఏరో ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. బెంగళూరులో జరుగుతున్నఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

aero india 2021
ప్రపంచంలోనే తొలి మెగా ఈవెంట్​ ఇదే: రాష్ట్రపతి

By

Published : Feb 5, 2021, 4:34 PM IST

కొవిడ్ వల్ల గతేడాది ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ.. ఏరో ఇండియా 2021 కార్యక్రమం విజయవంతంగా చేపట్టడంపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ హర్షం వ్యక్తం చేశారు. 43 దేశాల నుంచి ఉన్నత స్థాయి అధికారులు, 530 సంస్థలు.. ఇందులో పాల్గొన్నాయని చెప్పారు. కర్ణాటక బెంగళూరులో జరుగుతున్న 'ఏరో ఇండియా 2021' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న అధికారులు

వర్చువల్​గా ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం.. ప్రపంచంలోనే ఇదే మొదటిసారి అని రామ్​నాథ్​ కోవింద్​ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వల్ల వివిధ దేశాల్లోని, సంస్థలతో 201 కొత్త వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు జరిగాయని తెలిపారు.

ఏరో ఇండియా కార్యక్రమంలో హాజరయ్యేందుకు విచ్చేస్తున్న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

16,000 మంది పాల్గొన్నారు..

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ నిబంధనలు కొనసాగుతున్నప్పటికీ.. ఏరో ఇండియా 2021 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పేర్కొన్నారు. ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో 16,000 మంది పాల్గొన్నారని తెలిపారు. 4.5 లక్షలకు పైగా మంది వర్చువల్​గా పాల్గొన్నారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details