తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళను పొడిచి చంపిన గొలుసు దొంగ - దిల్లీ నేర విభాగం

దిల్లీలో ఓ గొలుసు దొంగ.. మహిళను కత్తితో పొడిచి హత్య చేశాడు. శనివారం రాత్రి ఆమె మార్కెట్​ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Delhi woman was stabbed to death by a chain snatcher in Delhi
లైవ్​: మహిళను కత్తితో పొడిచిచంపిన గొలుసు దొంగ

By

Published : Feb 28, 2021, 12:51 PM IST

దేశ రాజధాని దిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ(25)ను కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడో దుండగుడు. శనివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఆమె మార్కెట్​ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

మహిళపై దాడి జరిగిన సీసీటీవీ దృశ్యాలు

ఇదీ జరిగింది..

వాయవ్య దిల్లీలోని ఆదర్శ్​ నగర్​లో ఓ గొలుసు దొంగ.. మహిళ మెడలోని చైన్​ను దొంగిలించడానికి యత్నించాడు. ప్రతిఘటించిన ఆమెపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్రగాయాలపాలైన ఆమె మృతిచెందింది.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

2 రోజుల్లో రెండోది..

గత రెండు రోజుల్లో అక్కడ ఈ తరహా ఘటనలు వెలుగు చూడటం ఇది రెండోసారి. అంతకుముందు.. కల్కాజీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు తన సోదరి వెంటపడి, అసభ్యకరంగా మాట్లాడగా.. 17ఏళ్ల బాలుడు తిరగబడ్డాడు. దీంతో అతడిపై కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం బాధితుడు ఎయిమ్స్​ ట్రామా కేర్​ సెంటర్​ చికిత్స పొందుతున్నాడు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్​ చేశారు పోలీసులు.

ఇదీ చదవండి:నిర్మాణ ప్రదేశంలో 11 అడుగుల మొసలి

ABOUT THE AUTHOR

...view details