తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీని చంపుతానని పోలీసులకు ఫోన్..​ చివరకు... - మోదీ మర్డర్​ బెదిరింపు కాల్​

ప్రధాని మోదీని హత్య చేస్తానని పోలీస్​ కంట్రోల్​ రూంకు ఫోన్​ చేసి, బెదిరింపులకు దిగిన ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. జైలుకు వెళ్లాలనే కోరికతోనే తాను ఈ ఫోన్​ కాల్​ చేసినట్లు నిందితుడు చెప్పడం విశేషం.

threatens to kill PM Modi
మోదీని చంపుతానని ఫోన్​

By

Published : Jun 4, 2021, 5:15 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తానని పోలీస్​ కంట్రోల్​ రూమ్​కు ఫోన్​ చేసిన ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుణ్ని ఖజూరీ ఖాస్​ ప్రాంతానికి చెందిన సల్మాన్(22)​ అలియాస్​ అర్మాన్​గా గుర్తించారు.

తాను జైలుకు వెళ్లాలనే కోరికతో.. ఈ ఫోన్​ కాల్​ చేశానని నిందితుడు తమతో చెప్పాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. మాదక ద్రవ్యాలకు అతడు వ్యసనపరుడయ్యాడని చెప్పారు. 2018లో ఓ హత్య కేసులో జువైనల్​ కరెక్షన్​ హోమ్​లో ఉండి.. విడుదలయ్యారని వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి సమయంలో సల్మాన్​ ఈ ఫోన్​ చేశాడని పేర్కొన్నారు.

వెంటనే..

ఫోన్​ కాల్​ రాగానే వెంటనే అప్రమత్తమై.. ట్రేస్​ చేశామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అనంతరం ఖజూరీ ఖాస్​ ప్రాంతానికి వెళ్లాల్సిందిగా జిల్లా పోలీసు విభాగానికి సమాచారమిచ్చామని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో.. ఫోన్​ కాల్​ చేసే సమయంలో సల్మాన్​ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని వెల్లడించారు. అంతకుముందు 10 గంటల ప్రాంతంలో తన తండ్రి అతడిని తిట్టాడని చెప్పారు.

'జైలుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నావ్​' అని ప్రశ్నించగా.. తనకు అక్కడ ఉండాలనిపిస్తోందని దర్యాప్తు సమయంలో సల్మాన్​ చెప్పాడని సదరు సీనియర్​ అధికారి వెల్లడించారు. తాను డ్రగ్స్​ తీసుకున్నట్లు నిందితుడు అంగీకరించాడని చెప్పారు. ఇంటిలెజెన్స్​ బ్యూరోతో కలిసి దిల్లీ పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

ఇదీ చూడండి:'యోగి నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు భాజపా'

ఇదీ చూడండి:ఆ రోజులు పోయాయ్​: ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details