తెలంగాణ

telangana

By

Published : Jul 6, 2021, 12:43 PM IST

Updated : Jul 6, 2021, 12:51 PM IST

ETV Bharat / bharat

ట్విట్టర్‌ తీరుపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం

నూతన ఐటీ నిబంధనల అమలు విషయంలో ట్విట్టర్‌ తీరుపై మండిపడింది దిల్లీ హైకోర్టు. అధికారుల నియామకంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Delhi High Court, Twitter
ట్విట్టర్​, దిల్లీ హైకోర్టు

ట్విట్టర్‌ తీరుపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించింది. అధికారుల నియామకానికి ఇంకెంత కాలం పడుతుందని ట్విట్టర్​ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.

అధికారుల నియామకంలో జాప్యం వహిస్తే సహించేది లేదని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. భారత్​లో ట్విట్టర్​ కొనసాగాలంటే అధికారుల నియామకంలో ఆలస్యం ఉండకూడదని పేర్కొంది. అధికారిని నియమించకపోవడం కచ్చితంగా చట్ట ధిక్కరణ కింద పరిగణిస్తామని స్పష్టం చేసింది.

Last Updated : Jul 6, 2021, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details