తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాబా రాందేవ్​కు హైకోర్టు నోటీసులు - delhi hc summons baba ramdev

బాబా రాందేవ్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దిల్లీ వైద్య సంఘం దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. డీఎంఏ వ్యాజ్యానికి కౌంటర్​ దాఖలు చేయాలని సూచించింది.

delhi high court to baba ramdev
బాబా రాందేవ్​కు సమన్లు

By

Published : Jun 3, 2021, 1:15 PM IST

Updated : Jun 3, 2021, 4:37 PM IST

యోగా గురు బాబా రాందేవ్​కు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దిల్లీ వైద్య సంఘం (డీఎంఏ) దాఖలు చేసిన పిటిషన్​పై ఈమేరకు ఆదేశించింది. ఆ వ్యాజ్యానికి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. జూలై 13న తదుపరి విచారణ జరగనుంది.

పతంజలి సంస్థ రూపొందించిన కరోనిల్​ కిట్​పై రాందేవ్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా చూడాలంటూ డీఎంఏ ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. కరోనిల్​ కరోనాను నివారించలేదని.. రాందేవ్​ చేసినవ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పిటిషన్​లో పేర్కొంది.

ఇదీ చదవండి :Ramdev: 'రాందేవ్‌ బాబా క్షమాపణలు చెప్పాల్సిందే'

Last Updated : Jun 3, 2021, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details