తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2021, 12:56 PM IST

Updated : Apr 13, 2021, 1:10 PM IST

ETV Bharat / bharat

సీబీఎస్ఈ పరీక్షల రద్దుకు కేజ్రీ డిమాండ్

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతున్న క్రమంలో సీబీఎస్​ఈ పరీక్షలను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పరీక్షా కేంద్రాలు హాట్‌స్పాట్లుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశరాజధానిలో మంగళవారం ఒక్కరోజే 13 వేల 500 కేసులు వచ్చాయని తెలిపారు.

delhi cm kejeriwal
'సీబీఎస్​ఈ పరీక్షలు రద్దు చేయండి'

దేశంలో కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్​ఈ పరీక్షలను కేంద్రం రద్దు చేయాలని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్​ చేశారు. పరీక్షా కేంద్రాలు హాట్‌స్పాట్లుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో 6 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్​ఈ పరీక్షలు రాసే అవకాశముందని.. పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు, టీచర్లకు వైరస్‌ సోకే ప్రమాదముందని హెచ్చరించారు.

ఆన్​లైన్​లో..

పరీక్ష నిర్వహణపై ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయాలని కేంద్రానికి కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. పరీక్షలు లేకుండా ప్రమోట్‌ చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలన్నారు. తప్పనిసరి అనుకుంటే ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు జరపాలని విజ్ఞప్తి చేశారు.

మంగళవారం ఒక్కరోజే.. 13 వేల 500 కేసులు నమోదయ్యాయని, రానున్న రోజుల్లో వ్యాప్తి మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి :4.8 కోట్ల రూపాయల పాత నోట్లు స్వాధీనం

Last Updated : Apr 13, 2021, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details