తెలంగాణ

telangana

By

Published : Jun 8, 2021, 1:25 PM IST

ETV Bharat / bharat

తండ్రిని వెలేసిన 'కులం'- అన్నీ తామైన కుమార్తెలు

సామాజిక రుగ్మతలు చచ్చిన శవాన్ని కూడా పీడిస్తున్నాయి. సామాజిక బహిష్కరణకు గురైన ఓ వ్యక్తి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఏ ఒక్క గ్రామస్థుడూ ముందుకు రాలేదు. దీంతో ఆయన కూతుళ్లే అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

Daughters carried dead body
అంత్యక్రియలు చేసిన కూతుళ్లు

మహారాష్ట్రలో తండ్రికి అంత్యక్రియలు చేసిన కూతుళ్లు

కుల రక్కసి మానవత్వాన్ని మంట గలిపిన ఘటన మహారాష్ట్రలో మరోసారి వెలుగుచూసింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు చేయడానికి 'కుల పంచాయతీ' బహిష్కరణ తీర్పునకు భయపడి చంద్రాపుర్​కు చెందిన ఏ గ్రామస్థుడూ సాహసించలేదు. దీంతో ఆయన కూతుళ్లే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

పలు ఆర్థిక కారణాల వల్ల ప్రకాశ్ ఓగ్లే అనే వ్యక్తి కుటుంబంపై సామాజిక బహిష్కరణ సహా జరిమానా విధించింది కుల పంచాయతీ. జరిమానా చెల్లించలేని స్థితిలో ఉన్న ఓగ్లే.. 15 ఏళ్లుగా వెలివేతను అనుభవిస్తున్నారు. ఆయనకు ఏడుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు.

తండ్రి పాడె మోస్తున్న కూతుళ్లు

ఈ క్రమంలోనే అనారోగ్యంతో ప్రకాశ్ చనిపోగా.. అంత్యక్రియలకు గ్రామస్థులు నిరాకరించారు. దీంతో తండ్రిని పాడెపై మోసుకెళ్లి, కూతుళ్లే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఇదీ చూడండి:ప్రెసిడెంట్​పై కుల వివక్ష- కింద కూర్చొబెట్టి అవమానం!

ABOUT THE AUTHOR

...view details