తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!​.. రూ.60వేలు సుపారీ.. ప్రేమకు అడ్డొస్తాడని.. - తండ్రిని కొట్టడానికి నలుగురిని పురమాయించిన కూతురు

Daughter Conspired With Lover To Kill Father : మహారాష్ట్రలో తండ్రిపై దాడి చేయించింది ఓ కూతురు. అందుకు నలుగురు వ్యక్తులకు రూ.60వేల సుపారీ ఇచ్చింది. ప్రేమకు అడ్డువస్తాడని ఈ దారుణానికి పాల్పడింది. ప్రియుడితో కలిసి కుట్రకు తెరలేపింది. సోలాపుర్ జిల్లాలో ఘటన జరిగింది.

daughter-conspired-with-lover-to-kill-father-remove-obstacles-in-love-marriage-in-maharashtra
తండ్రిని చంపేందుకు ప్రియుడితో కలిసి కూతురు కుట్ర

By

Published : Aug 10, 2023, 7:51 AM IST

Updated : Aug 10, 2023, 8:20 AM IST

Daughter Conspired With Lover To Kill Father : ప్రేమకు అడ్డువస్తాడని తండ్రిపై దాడి చేయించింది ఓ కూతురు. ప్రియుడితో కలిసి ఈ కుట్రకు పాల్పడింది. అందుకు నలుగురు వ్యక్తులకు రూ.60వేల సుఫారీకూడా ఇచ్చింది. పథకం ప్రకారం సోమవారం రాత్రి తండ్రిపై దాడి చేయించింది. ఘటనలో తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. మహారాష్ట్రలో ఈ దారుణం జరిగింది. కేసులో కూతురు, ఆమె ప్రియుడితో పాటు దాడి చేసిన నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోలాపుర్ జిల్లాలోని మధ తాలుకాకు చెందిన మహేంద్ర షా.. ఆ చుట్టుపక్క ప్రాంతంలో పేరుమోసిన వ్యాపారవేత్త. అతని కూతురు సాక్షి. ఈమె చైతన్య అనే యువకుడ్ని ప్రేమించింది. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకునేందుకు.. మహేంద్ర కాళ్లు విరగ్గొట్టాలని పన్నాగం పన్నారు. అందుకు ఓ పథకం కూడా రచించారు.

పథకంలో భాగంగానే పుణెకు వెళ్లిన సాక్షి.. ఆదివారం రాత్రి తిరిగి మధకు వచ్చింది. షెట్ఫాల్ ప్రాంతంలో బస్​ దిగి తండ్రిని రమ్మని ఫోన్​ చేసింది. దీంతో కూతురుని ఇంటికి తీసుకువెళ్లేందుకు కారులో వచ్చాడు మహేంద్ర. అనంతరం తిరిగి వెళుతుండగా.. వాడచివాడి గ్రామ సమీపంలో టాయిలెట్​ వస్తుందని కారును ఆపింది సాక్షి. ఆ వెంటనే రెండు బైక్​లపై కారును అనుసరిస్తు వస్తున్న నలుగురు వ్యక్తులు మహేంద్రపై దాడి చేశారు. దారుణంగా కొట్టి.. అతని రెండు కాళ్లు విరగొట్టారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోయారు.

బాధితుడు మహేంద్ర షా

మహేంద్ర అరుపులు విన్న వాడచివాడి గ్రామ ఉప సర్పంచ్ బాపు కాలే, రామ్ చరణ్ అనే మరో వ్యక్తి ఘటన స్థలానికి వచ్చారు. తీవ్ర గాయాలతో ఉన్న మహేంద్రను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు.. బాధితుడి కూతుర్నే ప్రధాని నిందితురాలిగా తేల్చారు. కుట్రలో ఆమె ప్రియుడి హస్తం కూడా ఉన్నట్లు నిర్ధరించారు. వీరిద్దరితో పాటు మహేంద్రపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్​ చేశారు.

సాక్షి

Smoke in Vande Bharat Train: వందే భారత్ రైలులో పొగలు.. తప్పిన పెను ప్రమాదం

Electric Scooter Fire Accident : ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లాస్ట్.. బ్యాటరీ మార్చిన మూడోరోజునే బూడిదైన ఈవీ

Last Updated : Aug 10, 2023, 8:20 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details