దండకారణ్య ప్రాంతంలోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల్లో దాదాపు 100మంది మావోయిస్టులు కరోనా బారిన పడినట్లు పోలీస్ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. వీరిలో సుజాత అనే మహిళా మావోయిస్టు నేతకు కొవిడ్ సోకినట్లు పోలీస్ అధికారులకు సమాచారం అందింది. ఈమెపై సుమారు రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. మరో ఇద్దరు మావోయిస్టు అగ్ర నేతలైన దినేష్, జయలాల్ కూడా కరోనా బారిన పడినట్లు తెలిసింది. ఒక్కొక్కరిపై సుమారు రూ.10లక్షల చొప్పున నగదు రివార్డు ఉంది.
'మీ ద్వారా గ్రామాలకు నష్టం...'