తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దూసుకొస్తున్న 'యాస్​'- ఈదురుగాలుల బీభత్సం - యాస్​ తుపాను తాజా వార్తలు

యాస్​ తుపానుపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 12 గంటల్లో అతితీవ్ర తుపానుగా మారనుందని తెలిపింది. ఒడిశాలోని బాలేశ్వర్​​ వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.

Cyclone Yaas, యాస్​ తుపాను తాజా వార్తలు
యాస్​ తుపాను

By

Published : May 25, 2021, 10:18 AM IST

బంగాళాఖాతం తీరంవైపు దూసుకొస్తున్న యాస్​ తుపాను మరో 12 గంటల్లో అతితీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరించింది. తూర్పు-మధ్య బంగాళాఖాతం నుంచి తుపాను.. ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని పేర్కొంది. ఈ తుపాను బుధవారం సాయంత్రం ఉత్తర ఒడిశా-బంగాల్ తీవ్ర ప్రాంతాలను తాకుతుందని అంచనా వేసింది.

ఒడిశాలోని బాలేశ్వర్​​ వద్ద తుపానుతీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పారాదీప్‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 320 కిలోమీటర్ల దూరంలో తుపాను ఉన్నట్లు తెలిపింది. తుపాను ప్రభావానికి గాలులు గంటకు 101 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నట్లు వెల్లడించింది. తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 185 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

రాహుల్​ విజ్ఞప్తి​..

యాస్​ తుపానుకు ప్రభావితమైన ప్రజలకు అన్ని విధాలా అండగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. తుపాను తీరానికి చేరుతున్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్​ చేశారు.

ఇదీ చదవండి :'యాస్'​ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సన్నద్ధం

ABOUT THE AUTHOR

...view details