తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2021, 5:50 AM IST

ETV Bharat / bharat

విగ్గులు, లోదుస్తుల్లో భారీగా బంగారం పట్టివేత

అంతుచిక్కని రీతిలో కొత్త తరహాలో స్మగ్లింగ్​కు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇలా.. విదేశాల నుంచి విగ్గులు, లోదుస్తులు, సాక్సులో అక్రమంగా బంగారం తరలిస్తూ.. చెన్నై విమానాశ్రయంలో అడ్డంగా పట్టుబడ్డారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు​ చేసినట్టు అధికారులు తెలిపారు.

Customs at Chennai International Airport seized 5.55 kg gold worth Rs 2.53 crorse
'తల'పండిన స్మగ్లింగ్​లో రూ.2.53కోట్ల విలువైన బంగారం పట్టివేత

దుబాయి, షార్జా నుంచి ప్రత్యేక విమానాల్లో చెన్నైకి అక్రమంగా తీసుకొచ్చిన రూ. 2.53కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత నిందితులను అరెస్ట్​ చేశారు అధికారులు.

అక్రమంగా తరలిస్తున్న బంగారం, విదేశీ కరెన్సీ

ఇలా దొరికారు..

చెన్నై విమానాశ్రయానికి దుబాయి, షార్జా నగరాల నుంచి ఆదివారం రెండు ప్రత్యేక విమానాలు వచ్చాయని కస్టమ్స్​ విభాగం పేర్కొంది. అందులో ప్రయాణికులను తనిఖీ చేసి.. ఏడుగురు అనుమానితులను పట్టుకున్నారు. వారిపై ప్రత్యేక సోదాలు నిర్వహించగా.. ముడి బంగారంతో పాటు తల విగ్గు, లోదుస్తులు, సాక్సుల్లో దాచిన పసిడి పేస్టును గుర్తించారు. మొత్తం 5.55కిలోల బంగారం బయటపడగా.. దీని విలువ రూ. 2.53 కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేశారు. అంతేకాకుండా.. చెన్నై నుంచి షార్జాకు తరలించేందుకు తెచ్చిన రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్​ చేశారు.

విగ్గుల్లో బయటపడిన విదేశీ కరెన్సీ
విగ్గుల్లో దాచిన పసిడి పేస్ట్​
లోదుస్తుల్లో దాచిన బంగారం
అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం

ఇదీ చదవండి:మహిళ లోదుస్తుల్లో రూ.కోటి విలువైన బంగారం

ABOUT THE AUTHOR

...view details