తెలంగాణ

telangana

By

Published : Dec 10, 2021, 5:08 AM IST

Updated : Dec 10, 2021, 5:47 AM IST

ETV Bharat / bharat

నేడు సీడీఎస్​ బిపిన్ రావత్ అంత్యక్రియలు

Cremation of CDS General Rawat: సీడీఎస్ జనరల్​ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులికా రావత్ అంత్యక్రియలు శుక్రవారం దిల్లీలోని కంటోన్మెంట్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం వారి భౌతికకాయాలను సైనిక విమానంలో దిల్లీకి తరలించారు.

CDS General Bipin Rawat Cremation
బిపిన్ రావత్ అంత్యక్రియలు

Cremation of CDS Bipin Rawat: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్​ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ అంత్యక్రియలు దిల్లీలో శుక్రవారం జరగనున్నాయి. గురువారం సాయంత్రం వారి భౌతికకాయాలను సైనిక విమానంలో దిల్లీకి తరలించారు. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి.

రావత్​ దంపతుల భౌతికకాయాలను శుక్రవారం వారి నివాసానికి తరలించి.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత కామరాజ్ మార్గ్ నుంచి దిల్లీ కంటోన్మెంట్​లోని బ్రార్​ స్క్వేర్ శ్మశానవాటికకు అంతిమయాత్రగా తీసుకువెళ్లి.. అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ప్రముఖుల నివాళి..

తమిళనాడు కూనూర్​లో బుధవారం జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులిక రావత్​తో పాటు 11 మంది సైనికుల పార్థివదేహాలను దిల్లీలోని పాలం ఎయిర్​బేస్​కు తీసుకువచ్చారు. ఎయిర్​బేస్​కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అమరుల భౌతికకాయాలకు నివాళులర్పించారు. వారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అంతకు ముందు ఎయిర్​బేస్​కు చేరుకున్న రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ పార్థివ దేహాలకు నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు. అమరుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

Cds general helicopter crash: తమిళనాడులోని కోయంబత్తూర్​-కూనూర్​ మధ్యలో హెలికాప్టర్​ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.

ఇదీ చదవండి:Bipin Rawat: 'అగ్గిపెట్టె' సమాధానంతో ఆర్మీలో చేరిన రావత్​..!

Palam Air base: రావత్​ పార్థివదేహానికి మోదీ, ప్రముఖుల నివాళి

నేలరాలిన త్రిదళపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌

Last Updated : Dec 10, 2021, 5:47 AM IST

ABOUT THE AUTHOR

...view details