తెలంగాణ

telangana

కొత్తగా క్రీమ్​ ఫంగస్​.. ఆ రాష్ట్రంలో తొలి కేసు

మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లో కొత్తగా క్రీమ్​ ఫంగస్ కేసు వెలుగుచూసింది. అయితే.. బ్లాక్​, వైట్​ ఫంగస్​ల కంటే ఇది ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

By

Published : May 27, 2021, 8:19 PM IST

Published : May 27, 2021, 8:19 PM IST

cream fungus
క్రీమ్ ఫంగస్, బ్లాక్ ఫంగస్

మధ్యప్రదేశ్​ జబల్​పుర్​ వైద్య కళాశాల ఆసుపత్రిలో కొత్తగా క్రీమ్ ఫంగస్​ కేసు వెలుగుచూసింది. అయితే.. ఇది ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారు. అత్యంత ప్రమాదకారి బ్లాక్​ ఫంగసేనని అని అభిప్రాయపడ్డారు.

పర్యవేక్షణలో 150 మంది..

జబల్​పుర్​లో దాదాపు 150 మంది శీలీంద్ర వ్యాధుల కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు స్పష్టం చేశారు. జబల్​పుర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 100 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. 50 మంది ఇతర ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

మరోవైపు, బ్లాక్​ ఫంగస్​ చికిత్స కోసం వైద్య పరికరాలు, ఔషధాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. ఔషధాల రవాణా కోసం హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది.

ఇదీ చదవండి:20 రోజులుగా స్థిరంగా తగ్గుతున్న కరోనా

ABOUT THE AUTHOR

...view details