కొవిడ్ వ్యాక్సినేషన్ డిజిటల్ సర్టిఫికెట్ల జారీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరాటంలో భాగంగా దేశంలో తొలిసారి తయారుచేసిన వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్న వారంతా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు పొందవచ్చని ప్రకటించింది. కరోనా కట్టడే లక్ష్యంగా మన దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు తయారైన విషయం తెలిసిందే. ఆయా వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్లో భాగస్వాములైన దాదాపు 11,300 మందికి పైగా ఈ డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను కొ-విన్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకొనేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. వ్యాక్సిన్ ట్రయల్స్లో పాల్గొన్నవారికి డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలంటూ విజ్ఞప్తులు రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు 11,349మంది డేటాను ఐసీఎంఆర్ అందజేసిందని తెలిపింది.
మీ అద్భుత సహకారానికి థాంక్స్: కేంద్రమంత్రి ట్వీట్