తెలంగాణ

telangana

కొవిడ్ రెండో ఉద్ధృతికి జులైలో తెర!

By

Published : May 20, 2021, 6:15 AM IST

Updated : May 20, 2021, 6:58 AM IST

కరోనా రెండో దశ ఉద్ధృతి జులై కల్లా ముగుస్తుందని కేంద్రం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం తెలిపింది. 'సూత్ర'ప్రాయంగా అంచనాకు వచ్చారు శాస్త్రవేత్తలు. మరో 6 నెలల తర్వాతే మూడో దశ ఉంటుందని తెలిపారు.

covid
కొవిడ్, కరోనా

కరోనా రెండో దశ ఉద్ధృతితో యావత్ దేశం అల్లాడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం ఊరట కల్పించే కబురు వెల్లడించింది. కరోనా రెండో దశకు ఈ ఏడాది జులైలో తెరపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 'సూత్ర' అనే విధానం ద్వారా ఈ శాస్త్రవేత్తల బృందం పలు అంచనాలకు వచ్చింది. దేశంలో రోజువారీ కరోనా కేసులు.. మే నెలాఖరు కల్లా భారీగా తగ్గి లక్షా 50వేలకు చేరుకుంటాయని, జూన్‌ ఆఖరు నాటికి 20వేలకు తగ్గుతాయని తెలిపింది.

మరో ఆరు నుంచి 8 నెలల తర్వాతే కరోనా మూడో దశ ఉంటుందని.. శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. అక్టోబర్‌ వరకు ఇది ఉండకపోవచ్చని తెలిపింది. మూడో దశ స్ధానికంగానే ఉంటుందని, వ్యాక్సినేషన్‌ కారణంగా ఎక్కువ మందిపై దీని ప్రభావం ఉండకపోవచ్చని వివరించింది.

ఇదీ చదవండి:'మహా'లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Last Updated : May 20, 2021, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details